728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2020

ఆ ముగ్గురిని కరోనా విడదీసింది.. మూడు ఆసుపత్రుల్లో ఆ ముగ్గురు

చిలకలూరిపేట:
♦️ఒకే కుటుంబంలో ఇరువురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ కుటుంబం ఛిద్రమయ్యింది. ముగ్గురు ఉన్న ఆ కుటుంబంలో ముగ్గురు  మూడు చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో వున్నారు.

♦️చిలకలూరిపేట పట్టణ చిన్నపీరు సాహెబ్ వీధికి చెందిన ఒక మహిళకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా  వైరస్ సోకగా ఆ మహిళకు 25వ తేదీన విజయవాడ లోని ఆస్పత్రి ఐసోలేషన్ కు తరలించారు.

♦️ఆమె కుమారుడు, భర్తకు 27 వ తేదీ నుంచి కె.ఎం.సి  క్వారంటైన్ లో ఉంచారు. గత నాలుగు రోజుల క్రితం అతని కుమారుని కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అతనిని గుంటూరులోని గోరంట్ల క్వారంటైన్ సెంటర్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు.

♦️ఆమె భర్త ప్రస్తుతం కె.ఎం.సి క్వరెంటైన్ లో ఉన్నారు. కలసిమెలసి చిన్నపాటి పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆ కుటుంబంలోని ముగ్గురు నేడు చెట్టుకొకరు పుట్టకొకరు ల కరోనా విడదీసి  వారి తలరాతల్ని మార్చి, వేరు వేరు చోట్ల ఉండేలా చేసింది.

♦️ఆ మహిళ వైద్యశాలలో కోలుకుంటూ ఉండగా, ఆమె కుమారుడు గుంటూరు  గోరంట్లలోని క్వరెంటైన్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు.

♦️ఆమె భర్త కె.ఎం.సి క్వరెంటైన్ సెంటర్ లో ఉన్నాడు. అయితే గోరంట్ల లో ఉంటున్న ఆ యువకునికి సరైన ఆహార సదుపాయాలు, ఆదరణ కరువైందని ఆ యువకుడు బుధవారం నాడు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం, ఆ వీడియో చిలకలూరిపేటలో చక్కర్లు కొడుతుంది.

♦️తమకు ఈ దుస్థితి రావడం బాధాకరమని తనను జాగ్రత్తగా చూసుకోవాలని ఆ యువకుడు  ఆ వీడియోలో చెప్పటం తో ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందో  చెప్పటంతో కరోనా.. ఆ కుటుంబాల్ని ఎలా విడదీసిందో అందనిరిని ఆలోచింపజేస్తుంది.

ఆ యువకునికి మంచి ఆహారం ఇవ్వండి: ఎమ్మెల్యే రజని

♦️ఆ యువకుడికి గోరంట్ల ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించడం లేదని సోషల్ మీడియాలో వీడియో రావటంతో  చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గోరంట్ల ఆసుపత్రి వైద్యుల తో మాట్లాడి ఆ యువకునికి మంచి ఆహారం, వైద్యం అందించి ఇబ్బంది లేకుండా చేయాలని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆ ముగ్గురిని కరోనా విడదీసింది.. మూడు ఆసుపత్రుల్లో ఆ ముగ్గురు Rating: 5 Reviewed By: NEWS UPDATE