728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 22, 2020

వచ్చే నెల పదో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు!

న్యూఢిల్లీ:
★ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం.

★ కోవిడ్ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల తేదీలపై ప్రతిష్ఠంభన ఏర్పడింది.

★ అయితే వచ్చే నెల పదో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

★ ఒకరోజు లోకసభ సమావేశాలు, మరో రోజు రాజ్యసభ సమావేశాలు.. ఇలా జరుగుతాయని సమాచారం.

★ ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

★ లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమవుతారని, రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, రాజ్యసభలో కూర్చోనున్నారు.

★ అయితే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు.

★ స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

★ అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వచ్చే నెల పదో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు! Rating: 5 Reviewed By: NEWS UPDATE