నిరీక్షణ ఫలించింది.. వైఎస్ఆర్సిపి పార్టీ ను నమ్ముకున్న నేత మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నువ్వా నేనా అనే ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో మర్రి రాజశేఖర్ 22 ఓట్లు పడటంతో ఆయన గెలుపొందారు.
మర్రి రాజశేఖర్ గురించి:
పుట్టిన తేదీ....15-08-1957
జన్మస్థలం...ప్రత్తిపాడు మండలం,తిక్కిరెడ్డిపాలెం గ్రామం
తల్లిదండ్రులు.....రాలింగయ్య, హైమవతి
వృత్తి.... అడ్వకేట్ BA LLB ఏసీ కాలేజ్,గుంటూరు
భార్య ... లలిత
పిల్లలు ఇద్దరు.... అబ్బాయి, అమ్మాయి... మర్రి శ్రీనాథ్, హిమబిందు
2004 ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
MLA...2004 నుండి 2009 వరకు పనిచేశారు.
వైయస్సార్ ఆశీస్సులతో 2008 తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా కొనసాగారు.
వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీకి పాలక మండలి సభ్యులుగా కూడా పని చేశారు.
2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
వై.ఎస్.ఆర్ కుటుంబానికి అత్యంత విధేయులుగా ఉన్నారు.
25-03-2011, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
పార్టీలో చేరిన ఆరు నెలలకే ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్ష గా నియమితులయ్యారు
2018 వరకు ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు.

