పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేలుపై ఈరోజుతెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది.
వినుకొండ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు..

