728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 31, 2020

చిలకలూరిపేట లో 28 వ తేదీన 193 మందికి నిర్వహించిన కోవిడ్-19 పరీక్షా ఫలితాలు ఇవే..

చిలకలూరిపేట:
🔹చిలకలూరిపేట పట్టణంలో ఈనెల 28వ  తేదీన 193 మందికి కరోనా వైరస్ టెస్ట్ లు నిర్వహించారు.

🔹చినపీరుసాహెబ్ వీధికి చెందిన కొంతమంది, రజక వీధికి  చెందిన కొంతమంది, ఒక ప్రైవేటు వైద్యశాలకు సంబంధించి మరికొంతమందికి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన రజక కాలనీ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్ష నిర్వహించారు.

🔹కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా కలెక్టర్ 193 మందికి  నెగిటివ్ వచ్చినట్లు తెలియజేసినట్లువిశ్వాసనీయంగా తెలిసింది.  ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని సమాచారం.
ఈ వార్తతో  చిలకలూరిపేట పట్టణం చాలా వరకు సురక్షితంగా బయటపడిందని చెప్పవచ్చు. 

🔹గత రెండు రోజుల నుండి 28 వ తేదీ  పరీక్షలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయా  అని ఎదురుచూస్తున్న పట్టణ ప్రజలకు నెగిటివ్ రిజల్ట్ చాలా వరకు  ఉపశమనాన్ని ఇచ్చింది.

🔹అయితే ఇప్పటి వరకు పట్టణంలో కేవలం 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక   పాజిటివ్ పూర్తిగా నెగటివ్ గా మారగా, నలుగురు ఐసోలాషన్ లో చికిత్స పొందుతున్నారు.

🔹ఈ రోజు నిర్వహించిన 101 మంది పరీక్షలకు మరో రెండు మూడు రోజుల్లో రిజల్ట్ రానున్నాయి.

🔹ఏది ఏమైనప్పటికీ పట్టణంలోని పాజిటివ్ వచ్చిన వీధుల్లో అందరికి నెగటివ్ రావటం పేట  ప్రజలకు సంతోషించదగ్గ విషయంగా చెప్పవచ్చు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో 28 వ తేదీన 193 మందికి నిర్వహించిన కోవిడ్-19 పరీక్షా ఫలితాలు ఇవే.. Rating: 5 Reviewed By: NEWS UPDATE