చిలకలూరిపేట: స్వచ్ఛంద సేవా సంస్థ ఏ.ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం 100 మంది వృద్ధులకు బియ్యం నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేయడం జరిగినది. ఏఎంజి సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి ఆదేశాల మేరకు గణపవరం గ్రామంలోని చవిటి పాలెం లో గల వృద్ధుల మిడ్ డే మీల్ సెంటర్ కు చెందిన 50 మందికి, చిలకలూరిపేట పట్టణంలోని రూత్ డైకెమెన్ కాలనీకి చెందిన మరో 50 మంది వృద్ధులకు 5 కిలోల చొప్పున బియ్యంతో పాటు వంట నూనె సబ్బులు చింతపండు, గోధుమపిండి, కారప్పొడి లాంటి 14 రకాల నిత్యావసరాల ను, కూరగాయలను పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇవాంజిలికల్ మేనేజర్ బి జాన్ రాజు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
May 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: AMG ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

