🔹చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, రూరల్ ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, డి ఎం హెచ్ ఓ యాస్మిన్ తదితరులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
🔹ఈ సమావేశానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, రెవెన్యూ,పోలీస్ అధికారులు,మండల ప్రజా పరిషత్ అధికారులు,మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్:
🔹జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు, కరోనా సోకిన వ్యక్తి ని ప్రేమతో చూడాలని వారిని ద్వేషించచవద్దని తెలియజేశారు.
🔹రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఇకమీదట కరోనాతో సహజీవనం తప్పేలాలేదని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను తరిమికొట్టొచ్చని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్కు ఉంటే ఇటువంటి లక్షణాలు ఎదుటివారికి సోకవని ఈ సందర్భంగా వారు చెప్పారు.
🔹చేతులు శుభ్రం చేసుకోవాలని, కరోనా పాజిటివ్ ప్రాంతాల్లో మెడికల్ అధికారులు, అసిస్టెంట్లు గర్భిణులు, వృద్ధులు ,చిన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించేలా అధికారులకు తగు సూచనలు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాకు తెలియజేశారు.
ఎమ్మెల్యే విడదల రజని:
🔹చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేటలో అనూహ్యంగా ఐదు కేసులు నమోదైనట్లు అధికారులతో ఎప్పటికప్పుడు తాను సమాచారం తెలుసుకొని తగు సూచనలు చేస్తున్నానని తెలిపారు. ప్రతి విషయం జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మీడియాకు తెలియజేశారు.
🔹చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించి వలసిందిగా కోరినట్లు దీనికి కలెక్టర్ స్పందించి నర్సారావుపేట ఆర్డీవో వెంకటేశ్వరరావును నియోజకవర్గ నోడల్ అధికారి గా నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
