🔹గుంటూరు రీజియన్లో కేవలం 82 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని రీజినల్ మేనేజర్ STP రాఘవ కుమార్ తెలియజేశారు.
🔹చిలకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఆయన తనిఖీ చేయడానికి వచ్చినపుడు మీడియాతో మాట్లాడారు.
🔹చిలకలూరిపేట నుంచి నాలుగు బస్సులు మాత్రమే నడుస్తున్నాయని 50 శాతం మాత్రమే బస్సులో ప్రయాణాలకు ప్రయాణికులకు అనుమతిస్తున్నట్లు ఆయన అన్నారు.
🔹ఏపీఎస్ఆర్టీసీ కి రీజియన్ పరిధిలో రోజుకు కోటి రూపాయల నష్టం వస్తుందన్నారు. ఎనిమిదో తేదీ అనంతరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బస్సులను నడుపుతామని తెలిపారు. వీరి వెంట చిలకలూరిపేట డిపో మేనేజర్ సుజాత, తదితరులు ఉన్నారు.
