728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

జగన్‌కు సమాధానం చెప్పనున్న రఘురామకృష్ణం రాజు

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ లెటర్‌ హెడ్ కాకుండా మరో పేరుతో నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరాలు తెలిపిన రఘురామకృష్ణం రాజు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు నోటీసులపై సమాధానం ఇవ్వనున్నారు.

ఇప్పటికే విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణం రాజు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరుకు, తనకు నోటీసులు ఇచ్చిన వారి హోదాకు పొంతన లేదని తెలిపారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమాధానం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించిన ఆయన తాను జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని తెలిపారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో పలువురిని కలిసి అభిప్రాయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జగన్‌ను ఆయన నేరుగా కలిసి వివరణ ఇస్తారా? లేదా ఈ-మెయిల్ పంపుతారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్‌కు సమాధానం చెప్పనున్న రఘురామకృష్ణం రాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE