728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2020

వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై తెలుగుదేశం చార్జ్ షీట్ విడుదల చేసిన లోకేష్

అమరావతి:
★ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షకోట్లు దోచేశారు.

★ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది.

★ స్కామ్ ల కోసమే జగన్ స్కీములు తెచ్చారు.

★ ఉపాధి లేక పేదలు అల్లాడుతుంటే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకున్నారు

★ జగన్ పాలనపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు

★ ఎక్కడ చూసినా వైసీపీ నేతల అవినీతీ, అక్రమాలే

★ ఏడాదిలో రాష్ట్రంలో 564మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు

★ రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది

★ రైతుభరోసా కింద ఏడాదిలో రూ. 30 వేల కోట్లు దోచేశారు

జగన్ ది రైతు దగా ప్రభుత్వం

7 లక్షల పింఛన్లు తొలగించి పేదలు, వృద్ధులను రోడ్డున పడేశారు

★ 45 ఏళ్ల దాటిన మహిళలకు ఇస్తానన్న పింఛను ఏమైంది?

★ నాశిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు

★ మద్యం అమ్మకాల ద్వారా ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు జే ట్యాక్స్ వేస్తున్నారు.

అమ్మ ఒడి కింద 43 లక్షలమంది విద్యార్థులకు డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారు.

ఏపీలో ఇసుక మాఫియా చెలరేగుతోంది.

★ జగన్ ధన దాహంతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య.

★ కరోనా సాయాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారు

★ పేదలకు సెంటు భూమి పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు.

★ సెంటు భూమి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాబోతోంది.

★ ఆవ భూముల్లో భారీ స్కామ్ చేశారు.

★ మడ అడవులను మడతపెట్టేశారు.

★ జిల్లాల్లో వాలంటీర్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.

ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచారు.

★ రద్దులతో సంక్షేమానికి గండి కొట్టారు.

అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుకొట్టారు.

★ రాజారెడ్డి రాజ్యాంగంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన.

★ ఏపీలో దళితులకు రక్షణ కరువైంది.

★ మాస్కులు అడిగిన సుధాకర్ పై పిచ్చివాడిగా ముద్రేశారు.

అవినీతిని ప్రశ్నించిన డాక్టర్ అనితారాణిని వైసీపీ నేతలు వేధిస్తున్నారు.

★ ఏడాది వైసీపీ పాలనలో 370 అత్యాచారాలు జరిగాయి.

★ మహిళా హోంమంత్రి ఉండీ ఆడబిడ్డలకు రక్షణ కరువైంది.

★ జగన్ రెడ్డికి రాజ్యంగం అంటే లెక్కలేదు.

★ ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు.

★ రంగుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారు.

★ కోర్టులు చివాట్లు పెడుతున్నా జగన్ వైఖరిలో మార్పులేదు.

★ విధ్వంసమే జగన్ రెడ్డి మతం.

★ కక్షసాధింపులే జగన్ రెడ్డి కులం.

★ ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి విధ్వంసపాలనకు శ్రీకారం చుట్టారు.

★ సొంత బాబాయి హత్యకు గురైనా జగన్ సీబీఐ విచారించలేదు.

★ జగన్ రెడ్డి ఇంటి పేరు అసత్యం.

★ జగన్ రెడ్డి సొంత పేరు అబద్ధం.

★ అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారు.

★ అమరావతే రాజధానిని అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాటతప్పారు.

★ పోలవరాన్ని నిలిపేశారు.

★ మాపై ఆరోపణలను నిరూపించలేకపోయిన జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

★ ఏడాదిలో ఒక్క పరిశ్రమ రాలేదు, పైసా పెట్టుబడి రాలేదు.

★ టీడీపీ హయాంలో ప్రపంచమంతా ఏపీ గురించే చర్చ జరిగింది.

★ చంద్రబాబు అంతర్జాతీయ పరిశ్రమలను ఏపీకి తెచ్చారు.

★ తెలుగుభాషపై జగన్ కు గౌరవం లేదు.

★ సాక్షిని ఇంగ్లీష్ పేపర్, చానల్ గా మార్చుకోండి.

★ నేను ట్వీట్ పెడితేనే వైసీపీ వణుకుతోంది.

★ చేసిన తప్పులు ప్రజలకు తెలుస్తాయని భయపడుతున్నారు.

★ కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం.

★ కోవిడ్ ఇడియట్స్ అని వైసీపీ నేతలకు జాతీయ మీడియా పేరు పెట్టింది.

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాం.

★ ప్రజాసేవలో తెలుగుదేశం ముందుంటుంది.

★ తెలంగాణలో తెలుగుదేశం బలంగా ఉంది.

★ రాజకీయాల్లో గెలుపోటములు సమజం.

★ ప్రజల పక్షాన పోరాడిన వారిదే అంతిమ విజయం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై తెలుగుదేశం చార్జ్ షీట్ విడుదల చేసిన లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE