అమరావతి: నిరుపేదల ఇంటి స్థలాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి జగన్ సర్కార్ రైతుల వద్ద భూములు కొనుగోలు చేసింది.బీఅయితే ప్రభుత్వం నుండి రైతుల భూములు ఎంపిక చేసేందుకు అధికార వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు డబ్బులు కోట్ల రూపాయలు రైతుల నుండి వసూళ్లు చేశారు. రెవిన్యూ అధికారులు, ఎమ్మెల్యేలు తమ భూములను ఎంపిక చేయరనే భయంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు గుట్టుచప్పుడు కాకుండా ముట్ట చెప్పారని నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.
అవినీతి రహిత పాలన ద్యేయం అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడిన విషయంలో సీబీఐ దర్యాప్తు జరిపించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నవతరం పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇళ్లలో, నవతరం పార్టీ కార్యాలయాలలో ది 01.08.2020 న నిరాహారదీక్షలు చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.
అవినీతి రహిత పాలన ద్యేయం అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడిన విషయంలో సీబీఐ దర్యాప్తు జరిపించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నవతరం పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇళ్లలో, నవతరం పార్టీ కార్యాలయాలలో ది 01.08.2020 న నిరాహారదీక్షలు చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.

