728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 1, 2020

చిలకలూరిపేట రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు రాక ఆందోళన... 2వ తేదీతో ముగియనున్న వైయస్సార్ చేయూత దరఖాస్తు గడువు

చిలకలూరిపేట:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వైఎస్సార్ చేయూత పథకం 24.19 మంది లబ్ధిదారులకు 18.142 కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు వైయస్సార్ పెన్షన్ పొందని వారికి ఈ పథకం అమలు చేయనుంది.

ఈ పథకంలో 10,000 ఆదాయం, కరెంట్ బిల్లు 300 యూనిట్లు మించని వారు, కుల దృవీకరణ,ఆదాయం సర్టిఫికెట్లు పొంది బ్యాంక్ అకౌంట్ ల తో గత నెల జూన్ 25 నుండి ఈ నెల రెండో తేదీ వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే గత నెల 28వ తేదీన పంచాయతీ సెక్రెటరీ జీవో జారీ చేస్తూ ఈ పథకం లో ముస్లిం మైనార్టీ లోని బిసి బి, బి సి ఈ లు మినహా ఇతర ముస్లిం మైనార్టీలు కుల ధ్రువీకరణ పత్రం ఈ పథకానికి పొందుపరచడం అవసరం లేదని జీవో జారీ చేశారు.

అయితే ఈ పథకానికి సంబంధించి జూన్  25వ తేదీ నుండి లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత గ్రామాల్లోని వాలంటీర్లు, పట్టణాల్లోని వార్డు వాలంటరీ లకు అప్పగించారు. మొదటగా 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు వాలంటీర్లకు కొంత సమస్య ఎదురైంది.

లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో కరెంటు బిల్లు తీయకుండా మే నెలలో బిల్లు తీసిన విషయం విదితమే.  అయితే తీసిన రీడింగ్ డివైడ్ చేయకుండా రీడింగ్ మొత్తం మే నెల వేయటం వల్ల మూడు వందల యూనిట్ లు బిల్లు దాటిన వారు  ఈ పథకానికి అనర్హులని చెప్పడంతో కొంతమంది ఆందోళనకు గురయ్యారు.

అయితే ఈ యాప్ ను 28వ తేదీ తర్వాత యాప్ ను మార్పు  చేసిన ప్రభుత్వం మే నెలలో 300 యూనిట్లు దాటిన మహిళలు కూడా అర్హులు అని దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందని దరఖాస్తు చేసుకొనిచ్చారు .

ఇది ఇలా ఉంటే కుల దృవీకరణ పత్రం ముస్లిం మైనార్టీలకు బి సి బి, బీసీ ఈ లకు తప్ప మిగతా వారికి ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి ఈ రెండు కేటగిరీలు తప్ప మిగతా కేటగిరీలకు కుల దృవీకరణ పత్రం అవసరం లేదని 28 న  జీవో జారీ చేశారు.

ఇదంతా ఒక భాగం అయితే ఇంకో భాగం ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఈ పథకం వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. కారణం ఏమిటంటే 25వ తేదీ నుంచి  ఈ పథకం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కుల ధ్రువీకరణ, ఆదాయ పత్రాల కొరకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న వారు వారం నుండి చిలకలూరిపేట రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ 21వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ సర్టిఫికేట్లు అందకపోవడంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే సమయం ముగుస్తుందని ఆందోళనకు గురవుతున్నారు.

అయితే ఈ పథకం జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొని మూడో తేదీన సోషల్ ఆడిట్ ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆగస్టు 12న ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు రాక ఆందోళన... 2వ తేదీతో ముగియనున్న వైయస్సార్ చేయూత దరఖాస్తు గడువు Rating: 5 Reviewed By: NEWS UPDATE