నర్సారావుపేట సెంటర్ లో ఎస్బీఐ ఎటిఎం వద్ద డబ్బులు డ్రా చేయవచ్చని రాత్రి 12 గంటల సమయంలో అన్నా కాంటీన్ వద్ద ఆగి అతను కూర్చుని ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి అతనిని కొట్టి అతని వద్ద ఉన్న సుమారు 70 వేల రూపాయలను లాక్కుని వెళ్ళినట్లు ఆ వ్యక్తి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఆ ప్రాంతంలో ఉన్న వారిని విచారిస్తున్నారు. ఆ సంఘటన జరిగిన పరిసర ప్రాంత సీసీ ఫుటేజీ తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు.


