♦️పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పట్టణంలో నిన్న పద్మసాలిపేటలో శనివారం రెండు కేసులు నమోదు అయిన విషయం విధితమే.
♦️నేడు తాజాగా ఆదివారం పట్టణంలో ఉన్న గ్రామీణ పోలీస్ స్టేషన్లో పనిచేసే ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
♦️దీంతో పట్టణంలో ఈ సంఖ్య నేటికీ 22కు చేరుకుంది. గత మూడు నెలల్లో 11 కేసులు మాత్రమే నమోదు కాగా, గత వారం రోజుల నుండి పట్టణంలో 11 కరోనా కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య 22కు చేరుకుంది. ఇంకా కరోనా కేసులు పెరుగుతాయని పుర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
♦️అయితే పట్టణంలో ఉన్న వ్యాపార సముదాయాలన్ని సాయంత్రం ఏడు గంటలకే పట్టణ పోలీసులు మూసి వేపిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి అపరాధ రుసుము విధిస్తున్నారు. అయినా ఈ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.

