728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

కర్నూలు జిల్లా:
★ ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా  కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది.

★ బుధవారం ఉదయం 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు.

★ జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.

★ ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది.

★ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు.

జూరాలకు 60వేల క్యూసెక్కులు...
★ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

★ జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.440 మీటర్లకు చేరింది.

★ జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ9.500 టీఎంసీలుగా ఉంది.

★ దీంతో జూరాల జలాశయం నుంచి 55వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం Rating: 5 Reviewed By: NEWS UPDATE