728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 4, 2020

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌

అమరావతి:
★ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌ మంజూరైంది.

★ మంగళవారం సాయంత్రం 12 మందికి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

★ కొరియాకు చెందిన సీఈవో, డైరెక్టర్‌ సహా 12 మందికి బెయిల్‌ వచ్చింది.

★ కాగా.. స్టెరైన్‌ గ్యాస్‌ నిల్వలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 12 మంది అరెస్ట్‌ చేసిన విషయం.

కేసు పూర్వపరాలివీ..
★ కాగా.. నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

★ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది.

★ దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

★ రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు.

★ కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు.

★ వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

★ అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

★ ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు.

★ వీరిలో ఇంకా కొందరు విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

★ మనుషులే కాదు.. జంతువులు, సరిసృపాలు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి.

★ ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీపై గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

★ ఈ ఘటనపై 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE