🔷 నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
🔷 నిన్నటి నుండి నలతగా ఉండటం వలన నేడు కోవిడ్ పరీక్ష చేసుకున్న నేపధ్యంలో కరోనా పోసిటివ్ అని తెలిసింది.
🔷 జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు ఏమి లేవు. కావున ప్రస్తుతానికి హోమ్ క్వరెంటాయిన్ లొనే వున్నాను.
🔷 ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
🔷 మిగిలిన అన్నిరకాల పరీక్షలు మరియు చికిత్స చేయించు కొనుచున్నాను.
🔷 గత 5 రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోగలరు.
🔷 నెగిటివ్ వచ్చేవరకు ఎవరూ నన్ను సంప్రదించడానికి ప్రయత్నించొద్దు. స్థానిక నాయకుల సహకారంతో మీ పనులు పూర్తి చేసుకోగలరు.
🔷 త్వరితగతిన కరోనా నుండి కోలుకుని ప్రజాసేవ కొరకు మీ ముందుకు వస్తానని ఆయన ఒక వీడియో ద్వారా తెలిపారు.
