728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 23, 2020

ఒక రాజధానికే నిధులు లేవు మరి మూడు ఎలా కడతారు?: పేట అఖిలపక్షం

చిలకలూరిపేట: అమరావతి రాజధాని రైతుల నిరసన దీక్షలు నేటికి 250వ రోజుకు చేరుకోవడంతో వారికి సంఘీభావంగా పేట జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. మొదటగా తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసనలు తెలియ చేసి విన్నతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియంతల రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగుతోందని.. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్న చీమ కుట్టినట్లయినా లేదని.. ఉన్న ఒక్క రాజధానికే నిధులు లేవన్నారు మరీ మూడు రాజధానులు ఎలా కడతారో జగన్ రెడ్డి చెప్పాలని, జగన్ మూడు రాజధానులు కట్టేది లేదు మూడు రాజధానుల ముసుగులో బాక్సేట్ దోపిడీ చేయడానికని, రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని, ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎం.రాధాకృష్ణ, సిపిఐ కార్యదర్శి సిఆర్ మోహన్, తేదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్ మోహన్, అంబటి సోంబాబు, పఠాన్ సమద్ ఖాన్, లోక్ సత్తా నాయకులు మాదాసు భానుప్రసాద్, బహుజన సమాజ్ వాది పార్టీ నాయకులు నల్లపు కోటి, సీపీఐ నాయకులు, నాగభైరు సుబ్బాయమ్మ, పేలురి రామారావు, ఏఐవైఎఫ్ సుభాని, టీడీపీ నాయకులు మురుకొండ మల్లిబాబు, తాళ్లూరి బాబూరావు, షేక్ అజరుద్దీన్, అరే మల్లి, లోక బ్రహ్మయ్య, సలవుద్దీన్, గేర రాజశేఖర్, మరుబోయిన శ్రీనివాసరావు, దార్ల సుబ్బారావు, వడ్డని సుబ్బారావు, మాణిక్యాలరావు, జవ్వాజి బుచ్చిబాబు, కరిముల్లా, బాజి, బొల్లాయ్య, పిల్లి కోటి, అబ్దుల్లా బాషా, పూర్ణ సింగ్, మటన్ సుభాని, పఠాన్ కరిముల్లా, మాలిక్, జాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గనవరపు సుబ్రహ్మణ్యం, మద్దుమాల ప్రసన్నాంజనేయలు, క్రాంతి కుమార్, కాటూరి కోటేశ్వరరావు, వినాయకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఒక రాజధానికే నిధులు లేవు మరి మూడు ఎలా కడతారు?: పేట అఖిలపక్షం Rating: 5 Reviewed By: NEWS UPDATE