చిలకలూరిపేట: నేడు ఆన్లైన్ మోసాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా పథకాలు మీకు అందాయా అంటూ, మీకు ఆ పథకం రావాలంటే 2000/- రూపాయలు అకౌంట్ కు కొట్టండి అంటూ ఫోన్ చేసి మరి ఘరానా మోసం చేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం... చిలకలూరిపేట పట్టణంలోని, కొన్ని సచివాలయ పరిదుల్లో ఫోన్ చేసి నేను అమరావతి సచివాలయం నుండి... మీకు జగనన్న అమ్మ వడి, వాహన మిత్ర పడుతున్నాయా అంటూ అమరావతి సచివాలయం నుండి ఫోన్ చేసిన సదరు వ్యక్తి ఆ వార్డు వాలంటరీతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాదించాడు. నిజంగా ఆ వార్డు వాలంటరీ మాట్లాడటంతో సచివాలయ అధికారులేనని సదరు వ్యక్తి మాట్లాడి చివరకు 2000 రూపాయలు మీ ఫోన్లో ఉంటే జమ చేయండి లేదంటే మీ తెలిసిన వారి నెంబర్ అయినా చెప్పండి అంటూ చెప్పటంతో డబ్బు పంపకుండా ఆగిపోయాడు. అదేరోజు అదే వార్డులో చాలామందికి సదరు వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లు సమాచారం తెలిసింది. సదరు వ్యక్తి కాల్ చేసిన రికార్డు కాల్ వినండి.
November 19, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అమ్మవడి వేయాలంటే 2 వేలు వేయాలంటూ ఘరానా మోసం...
Rating: 5
Reviewed By: NEWS UPDATE
