728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

త్వరలోనే స్వావలంబన భారత్‌: పవన్‌

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన శనివారం ట్వీట్‌ చేశారు.

ఈ ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని పవన్‌ అన్నారు. త్వరలోనే భారత్‌ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్ది భారత్‌దేనని చెప్పారు. ముందు చూపు, ధైర్యసాహసాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అది సాధ్యం కానుందని పేర్కొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: త్వరలోనే స్వావలంబన భారత్‌: పవన్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE