చిలకలూరిపేట: పట్టణంలోని మూడు కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో ఈనెల 19వ తేదీన ఇంటెలిజెన్స్ అనాలసిస్ మానిటరింగ్ క్వారంటైన్ సర్వీసెస్ బస్సులో సుభాని నగర్, రజక వీధి, చిన్నపీరు సాహెబ్ వీధి మరియు ఇతర ప్రాంతాల్లోని అనుమానితులయిన 330 మందికి కోవిడ్-19 పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షల్లో 330 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు చిలకలూరిపేట నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. పట్టణంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 330 మందికి నెగిటివ్ రావడంతో ఆ మూడు ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ పరీక్షల్లో 330 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు చిలకలూరిపేట నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. పట్టణంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 330 మందికి నెగిటివ్ రావడంతో ఆ మూడు ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

