న్యూ ఢిల్లీ: కరోనా నేపధ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ఐటీ)రిటర్నుల సమర్పణ గడువును జులై 31 వరకు పెంచుతూ బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20కు చెందిన రిటర్నుల సమర్పణ గడువును నవంబరు 30 వరకు పెంచుతూ గతంలోనే ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల మినహాయింపు కోసం చేసే పెట్టుబడుల గడువును కూడా జులై 31 వరకు పెంచింది. ఆధార్-పాన్ అనుసంధానం గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల మినహాయింపు కోసం చేసే పెట్టుబడుల గడువును కూడా జులై 31 వరకు పెంచింది. ఆధార్-పాన్ అనుసంధానం గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది.

