728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 25, 2020

తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది: చంద్రబాబు నాయుడు

అమరావతి:
★ ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

★ అయితే అంతకన్నా ఆందోళనకర విషయం ఏమంటే... కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ప్రజారోగ్యంతో ఆటలాడటం.

★ కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం, బ్లీచింగ్ పౌడర్ స్కామ్ లు చూసాం.

★ ఇప్పుడు తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది.

★ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చేసిన కరోనా పరీక్షల్లో తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని వైసీపీ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ఆయన్ను క్వారంటైన్ కు వచ్చేయమన్నారు.

★ కానీ అప్పటికే హైదరాబాద్ లో ఉన్న దీపక్ రెడ్డి అక్కడ రెండు చోట్ల SARS-CoV-2 RT-PCR పరీక్ష చేయించుకుంటే రెండు రిపోర్టుల్లోనూ నెగటివ్ అని వచ్చింది. ఏమిటిది? ఎక్కడ తప్పు జరుగుతోంది?

★ కరోనా పాజిటివ్ అని నిర్ధారించడానికి మొదటగా TRUENAT అనే పరీక్ష చేస్తారు.

★ TRUENAT పరీక్షలో పాజిటివ్ అని వస్తే... తప్పనిసరిగా RT PCR పరీక్ష కూడా  చేసి అందులో పాజిటివ్ వస్తేనే పాజిటివ్ అని నిర్ధారించాలని ICMR చాలా స్పష్టంగా చెప్పింది.

★ మరి ప్రభుత్వం ఆ నిబంధనలు ఎందుకు పాటించలేదు?

★ అసలు వారు చేసింది ఏ పరీక్ష అన్నది రిపోర్టులో ఎందుకు రాయలేదు?

★ రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరా? అందులో ఖచ్చితత్వం ఇదేనా?

★ నెగటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో కూడా ఇలాగే ఆడుకుంటున్నారా?

★ పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్ లో ఎందుకు పెట్టాలనుకున్నారు?

★ కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉంది.

★ అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది: చంద్రబాబు నాయుడు Rating: 5 Reviewed By: NEWS UPDATE