728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు: చంద్రబాబు

అమరావతి:
★ రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల పనులు నిలిచి పోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి కారణంగా రైతులు, పేదలు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శికి లేఖ రాసాను.

★ తెలుగుదేశం హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

★ కానీ ఈ ఏడాది కాలంలో అందులో మూడో వంతు కూడా ఖర్చుపెట్టలేదు.

★ చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు నీరందించాలన్న సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి 2వ దశ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం.

★ హంద్రీ-నీవా 2వ దశ పనులను 90% వరకు పూర్తి చేసి శ్రీశైలం నీటిని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం వరకు ప్రయోగాత్మకంగా విడుదల చేస్తే... ఆ ప్రాంతానికి నీళ్ళు రావడం చూసి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

★ అలాంటిది మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కనపెట్టింది.

★ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు.

★ ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ నీటిపారుదల పనులు పూర్తిచేసి ప్రభుత్వం రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE