728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

తెదేపా కార్యకర్తలపై దాడులు అమానుషం

విజయవాడ: పొన్నూరు, మంత్రాలయం నియోజక వర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు అమానుషమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడడం వైకాపా అరాచక శక్తులకు తగదని హెచ్చరించారు. బీసీలు, దళితులపై వైకాపా దాడులు గత ఏడాదిగా శ్రుతిమించి పోయాయని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడటం, తోటలు తగులపెట్టడం, బోర్లు ధ్వంసం చేయడం వంటి తదితర అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ఈ విషయంలో డీజీపీ తక్షణమే స్పందించి దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తెదేపా కార్యకర్తలపై దాడులు అమానుషం Rating: 5 Reviewed By: NEWS UPDATE