728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

ఆగస్టు వరకూ రైల్ కూత బంద్!

న్యూఢిల్లీ:
★ ఆగస్టు వరకూ రైల్ కూత వినపడే సూచనలు ఏమాత్రం లేవని తెలుస్తోంది.

★ పూర్తి నిబంధనలతో దేశీయ విమానాల రాకపోకలకు అనుమతులు లభించినా... రైళ్లకు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకూ అనుమతులు లభించనట్లు సమాచారం.

★ ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలంటూ ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని జోన్లకూ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

★ అంతేకాకుండా వీరందరికీ కూడా డబ్బును రిఫండ్ చేసేయాలని కూడా సూచించారు.

★ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్లను ప్రత్యేక రైళ్లుగా గుర్తిస్తామని, అంతేకాకుండా 230 మెయిల్స్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నడుస్తున్నాయని అధికారులు ఓ రిపోర్టులో పేర్కొన్నారు.

★ మామూలుగా అయితే 120 రోజుల ముందు నుంచే టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది.

★ ప్రస్తుతం నడుస్తున్న నిబంధనల ప్రకారం మాత్రం రైల్వే శాఖే గనుక రైళ్లను రద్దు చేస్తే... ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా వారి డబ్బులు కూడా వాపసు చేస్తోంది రైల్వే శాఖ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆగస్టు వరకూ రైల్ కూత బంద్! Rating: 5 Reviewed By: NEWS UPDATE