అమరావతి: మీ ప్రభుత్వ అవినీతి చిహ్నం ఆ రేకుల షెడ్డు’ అంటూ ప్రజావేదికనుద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీర్చిన ప్రజావేదిక మీకు రేకుల షెడ్డా అంటూ మండిపడ్డారు.
‘‘ప్రజా సమస్యలు తీర్చిన ప్రజావేదిక మీకు రేకులషెడ్డా? 108 అంబులెన్సుల స్కామ్లో మీ బంధువుల 307కోట్ల అవినీతితో విజయసాయిరెడ్డి మైండ్ బ్లాంక్ అయి సంవత్సరీకాలు గుర్తొస్తున్నాయి. క్యాష్, క్యాస్ట్, కరప్షన్ ఈ మూడు"సీ"లు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని దేశం కోడైకూస్తుంటే మీకు వినబడుతుందా? జగన్గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్లో పేర్కొన్నారు.
‘‘ప్రజా సమస్యలు తీర్చిన ప్రజావేదిక మీకు రేకులషెడ్డా? 108 అంబులెన్సుల స్కామ్లో మీ బంధువుల 307కోట్ల అవినీతితో విజయసాయిరెడ్డి మైండ్ బ్లాంక్ అయి సంవత్సరీకాలు గుర్తొస్తున్నాయి. క్యాష్, క్యాస్ట్, కరప్షన్ ఈ మూడు"సీ"లు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని దేశం కోడైకూస్తుంటే మీకు వినబడుతుందా? జగన్గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్లో పేర్కొన్నారు.

