ప్రస్తుతం అమెరికాలో దాదాపు 19 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. 1,09,000 మందికి పైగా మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న దేశంగా యూఎస్ నిలిచింది. ఇక భారత్లో 2,36,184, చైనాలో 84,177 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. భారత్ ఇప్పటి వరకు 40 లక్షల టెస్టులు చేయడం గమనార్హం.
‘నా ప్రజలకు నేనొక్కటే చెబుతున్నా. మనం ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు నమోదవుతాయి. అదే భారత్, చైనా, ఇతర దేశాల్లో ఎక్కువ పరీక్షలు చేస్తే కచ్చితంగా అక్కడ కూడా ఎక్కువ కేసులు నమోదవుతాయి’ అని ట్రంప్ అన్నారు.
అమెరికాలోని ప్యూరిటన్ కంపెనీ ర్యాపిడ్ టెస్టులకు అవసరమైన స్వాబ్లను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. దానిని ఉద్దేశించే ట్రంప్ మాట్లాడారు. ‘టెస్టుల సామర్థ్యాన్ని పెంచినందుకు ధన్యవాదాలు. మన దేశం మళ్లీ తెరుచుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాలు పెరిగిన నెలగా ఇది రికార్డు సృష్టించింది. ఎన్నికలకు ముందే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’ అని ట్రంప్ వెల్లడించారు.

