★ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
★ ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగం ఉంటుంది.
★ షెడ్యూల్ ప్రకారం లెహ్ నుంచి మోదీ మాట్లాడాల్సి ఉండగా, దేశంలో కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా దేశ రాజధాని నుంచే ఆయన ప్రసంగించన్నారు.
★ ఉదయం 7 గంటలకు పలు సామాజిక మాధ్యమాల్లో మోదీ ప్రసంగం లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
★ గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన మెగా ఈవెంట్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
★ రాంచీలో ఈ కార్యక్రమం జరిగింది.
★ తాజాగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలపైన, కోవిడ్-19 విసురుతున్న సవాళ్లపైనా ఈసారి యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు.

