728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఇలా చేయాల్సిందే..

న్యూఢిల్లీ:
★ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5.0 లాక్ డౌన్‌ను జూన్-30 వరకు దేశవ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే.

★ ఈ సందర్భంగా కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం.. తాజాగా.. మరికొన్నింటికి అనుమతులిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటన రూపంలో విడుదల చేసింది.

★ జూన్-08 నుంచి కార్యాలయాలు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ప్రారంభం కానున్నాయి.

★ ఈ నేపథ్యంలో ప్రామాణిక నిబంధనలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

 ★ దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో వేటినీ చేతితో తాకరాదు.

★ దేవాలయాల్లో తీర్థ, ప్రసాదాలు పంచరాదు.

★ భక్తులపై పవిత్ర జలాలను చల్లరాదు.

★ నోటికి మాస్క్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతించాలి.

★ గర్భిణీలు, వృద్ధులను అనుమతించకూడదు.

★ థర్మల్ స్క్రీనింగ్ చేశాకే దేవాలయాల్లోకి అనుమతించాలి.

★ వీలైనంత వరకూ సామూహిక ప్రార్థనలు చేయకూడదు.

★ సామూహిక గీతాలు, భజనలు పాడవద్దు.

★ రికార్డింగ్ ద్వారా మాత్రమే భజనలు పెట్టాలి.

★ వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఇలా చేయాల్సిందే.. Rating: 5 Reviewed By: NEWS UPDATE