★ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5.0 లాక్ డౌన్ను జూన్-30 వరకు దేశవ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే.
★ ఈ సందర్భంగా కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం.. తాజాగా.. మరికొన్నింటికి అనుమతులిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటన రూపంలో విడుదల చేసింది.
★ జూన్-08 నుంచి కార్యాలయాలు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ప్రారంభం కానున్నాయి.
★ ఈ నేపథ్యంలో ప్రామాణిక నిబంధనలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..
★ దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో వేటినీ చేతితో తాకరాదు.
★ దేవాలయాల్లో తీర్థ, ప్రసాదాలు పంచరాదు.
★ భక్తులపై పవిత్ర జలాలను చల్లరాదు.
★ నోటికి మాస్క్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతించాలి.
★ గర్భిణీలు, వృద్ధులను అనుమతించకూడదు.
★ థర్మల్ స్క్రీనింగ్ చేశాకే దేవాలయాల్లోకి అనుమతించాలి.
★ వీలైనంత వరకూ సామూహిక ప్రార్థనలు చేయకూడదు.
★ సామూహిక గీతాలు, భజనలు పాడవద్దు.
★ రికార్డింగ్ ద్వారా మాత్రమే భజనలు పెట్టాలి.
★ వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి.

