728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 14, 2020

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య

ముంబయి: ‘ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సుశాంత్‌ సింగ్‌ తొలుత టెలివిజన్‌ నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు. ఆ తర్వాత 2013లో బాలీవుడ్‌ చిత్రం ‘కై పో చీ’తో వెండితెరకు పరిచయమైన సుశాంత్‌ వరుస చిత్రాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టివ్‌ బైకేశ్‌ బక్షి’ తదితర చిత్రాల్లో నటించాడు. టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎం.ఎస్‌.ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంతో ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత సుశాంత్‌ ‘రాబ్తా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సంచీరియా’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్‌’ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘దిల్‌ బెచరా’ చిత్రీకరణ దశలో ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య Rating: 5 Reviewed By: NEWS UPDATE