నిజం కన్నా అబద్దానికే విలువ ఎక్కువ.సోషల్మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఏవార్త నిజమో.. ఏది అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో విశ్వసనీయమైన వార్తలకు విలువిచ్చే మా https://www.24x7newsupdate.comలో ఏది నిజం...!? అనే కొత్త శీర్షిక ప్రారంభించాం.
వైరల్గా మారిన వార్త..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. శానిటైజర్ను ఎక్కువగా వాడినా ప్రమాదం పొంచి ఉన్నట్టే అంటున్నారు నిపుణులు. శానిటైజర్లను అతిగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయంటున్నారు. పరిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు కడుక్కోవడం ఉత్తమం అంటున్నారు. అదేపనిగా శానిటైజర్లు వాడితే.. కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కంటిన్యూగా 50 నుంచి 60 రోజులు హ్యాండ్ శానిటైజర్ వాడితే... ప్రమాదకర చర్మ వ్యాధులు వస్తాయనీ, కాన్సర్ వస్తుందనిప్రచారం జరుగుతుంది. ఈవార్త.నెట్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వార్తను తమ స్నేహితులకు, ఇతరులకూ షేర్ చేసుకున్నారు.
నిజమేమిటి...?
ఈ వార్తపై కేంద్ర ఆరోగ్యశాఖ ఏం చెప్పిందంటే....
ఇందులో 1 శాతం కూడా నిజం లేదని ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. హ్యాండ్ శానిటైజర్ అనేది మనుషులకు హాని చెయ్యదనీ... అందులో ఆల్కహాల్ శాతం కనీసం 70 కంటే ఎక్కువ ఉండేలా చేసుకుంటే... అది క్రిములతో చక్కగా పోరాడగలదని వివరించారు. కరోనా వైరస్తో పోరాటేందుకు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు వాడాలని సూచించారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ... ఈ వార్తలో నిజం లేదనీ, ఇది ఫేక్ న్యూస్ అని ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు చెప్పింది.

