728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

ఏపీ అభివృద్ధికి మోదీ అనేక నిధులు ఇచ్చారు: నిర్మలా సీతారామన్‌

అమరావతి:
★ ఏపీ అభివృద్ధికి మోదీ అనేక నిధులు ఇచ్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

★ స్థూల దేశీయ ఉత్పత్తిలో ఏపీ 9వ ర్యాంక్‌లో ఉందని, ఏపీలో 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.936.16 కోట్లు వేశామని వెల్లడించారు.

★ మత్స్య సంపద యోజన కింద దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఇచ్చామని, ఆక్వా, మెరైన్‌ ఫిషింగ్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించామని నిర్మలాసీతారామన్‌ చెప్పారు.

★ దేశంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో ఏపీకి 3 స్థానంలో ఉందని, ఏపీ ప్రభుత్వానికి కోవిడ్‌ ఫైట్‌ కింద రూ.8025 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.

★ అంతర్జాతీయ సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లను క్యాన్సిల్‌ చేయడం వల్ల.. భారతదేశ ప్రాజెక్ట్‌ల్లో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.

★ కేంద్రం ఒక స్థాయిలో 2.70 పైసలకు విద్యుత్‌ ఇస్తున్నా.. ఏపీలో రూ.9 ఛార్జీ చేయడం విని ఆశ్చర్యపోయామని చెప్పారు.

★ ఏపీ ప్రజలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇచ్చామని, రూ.500 చొప్పున 3 నెలలు జన్‌ధన్‌ ఖాతాల్లో వేశామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ అభివృద్ధికి మోదీ అనేక నిధులు ఇచ్చారు: నిర్మలా సీతారామన్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE