అమరావతి: దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగింటికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగు అనివార్యమైంది. వైకాపా నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, తెదేపా నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది..
June 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

