గుంటూరు: నరసరావుపేట పార్లమెంట్ సభ్యునిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా.. గుంటూరు పట్టణంలోని జేకేసీ కాలేజీ రోడ్డులోని పార్టీ కార్యాలయం నందు నాయకులు కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణం చేసిన నాటి శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు గాను నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి బాటలో నడుస్తూ.. అనునిత్యం ప్రజల బాగోగుకై పాటుపడతానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్నీ టీజీ. కృష్ణారెడ్డి, నాయకులు బాసులింగారెడ్డి, పెండ్యాల సురేష్, అల్లూ శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
June 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఎంపీగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

