చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర తీశారన్నారు. E.S.I మందుల కుంభకోణoలో సదరు శాఖలో ఉన్నతాధికారుల నుండి క్షేత్రస్థాయిలో ఫార్మసిస్ట్ లు, సీనియర్ అసిస్టెంట్ ల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలగా, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉద్యోగులు చేసిన స్కాం తో ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. ఈరోజు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖలలో ఉద్యోగులు నిత్యం చేసే అవినీతికి సదరు మంత్రులు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. అవినీతిపరులైన కొందరు ఉద్యోగులు గత పదేళ్లుగా క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ కలిసి కుమ్మక్కై చేసిన అవినీతిలో ఎటువంటి ప్రమేయం లేని అచ్చెన్నాయుడుని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని తెలిపారు. అసెంబ్లీలో బీసీ నాయకుల గళం విప్పితే ముఖ్యమంత్రి సహించలేక పోతున్నారని, అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అచ్చెన్నాయుడు అరెస్టును ఖండించిన వారిలో మాజీ జి.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు.
June 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికం: మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

