728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2020

నేడు 200 మందికి కోవిడ్-19 పరీక్షలు... కోవిడ్ కేర్ సెంటర్ కు తొమ్మిది మంది వైద్య సిబ్బంది నియామకం

చిలకలూరిపేట: పట్టణంలో వారం రోజుల్లో 11 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి విధితమే. అయితే ఈ వారం లో నమోదైన 11 కేసులయిన ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్ ల కేసులు నమోదైన ప్రాంతాలైన పద్మశాలి పేట, సి.ఆర్ కాలనీ, శారదా హైస్కూల్ పక్కన ఉన్న ప్రాంతం, తదితర ప్రాంతంలోని సుమారు 200 వ్యక్తుల కు సంబంధించి ఈరోజు వైద్యులు ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలసిస్ సర్వీసెస్ క్వారంటైన్ బస్సు ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు.

చిలకలూరిపేట పట్టణంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వల్ల జనం ఆందోళనకు గురవుతున్నారు. అయితే భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి శానిటైజర్ లు వాడుతూ కరోనాను కొంతమేరకు నివారించవచ్చని వైద్యులు చెప్పడం జరుగుతుంది.

జనం పని లేకుండా బయట తిరిగ రాదని పోలీసులు  మరో పక్క చెప్తున్నా జనం రద్దీ  ప్రాంతాల్లో తిరిగి కరోనా కు గురవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

చిలకలూరిపేటలో కోవిడ్ కేర్ సెంటర్ కు తొమ్మిదిమంది డెప్యూటేషన్ సిబ్బంది
నియామకం


చిలకలూరిపేట పట్టణం లోని 52 ఎకరాల్లో ఉన్న  తిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసి ఉన్న కోవిడ్ కేర్  సెంటర్కు ముగ్గురు వైద్యులను, ముగ్గురు MLHP లను ముగ్గురు MNO లను  జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా డి.ఎం.హెచ్.ఓ యాస్మిన్ ఉత్తర్వులు విడుదల చేశారు. వీరికి నోడల్ అధికారి గోపీనాయక్ పర్యవేక్షణలో ఆసుపత్రిలో సిబ్బంది పని చేస్తారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు 200 మందికి కోవిడ్-19 పరీక్షలు... కోవిడ్ కేర్ సెంటర్ కు తొమ్మిది మంది వైద్య సిబ్బంది నియామకం Rating: 5 Reviewed By: NEWS UPDATE