అమరావతి: వైయస్సార్ సతీమణి వైయస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైయస్సార్’’ పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైయస్సార్ సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా డాక్టర్ వైయస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం.