చిత్తూరు:
★ తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని రైతు నాగేశ్వరరావు చేతులెత్తి వేడుకున్నారు.
★ చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి వ్యవసాయం చేయించడంపై చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్ను కొనిచ్చిన విషయం తెలిసిందే.
★ మంచి మనసు చాటుకున్న సోనూసూద్ను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అభినందించి.. రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతల్ని తీసుకున్న విషయం కూడా తెలిసిందే.
★ అయితే ఇలా సాయం చేయడాన్ని ఏపీలోని ఓ పార్టీ, వర్గానికి చెందిన నేతలు జీర్ణించు కోలేకపోయారు. వెంటనే దుష్ప్రచారానికి తెరలేపారు.
★ రైతు నాగేశ్వరరావు నిజంగా పేదవాడు కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
★ దీంతో మనస్థాపం చెందిన రైతు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
★ తన నిజ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మహల్రాజపురానికి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
★ తన కూతుళ్లను చంద్రబాబు చదివిస్తానని చెప్పడంతోనే తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
★ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నాగేశ్వరరావు తెలిపారు.
★ తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్ను గిఫ్ట్గా ఇస్తే ఇలా దుష్ప్రచారం చేయడమేంటని నాగేశ్వరరావు వాపోయారు.
★ దుష్ప్రచారం చేసే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
★ ఇక ఈ దుష్ప్రచారంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
★ ఎవరో దయతలిస్తే తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.
★ పేద రైతుకు సాయం చేయకపోగా ఎవరో అండగా ఉంటే ఓర్చుకోలేకపోతారా? అని ప్రశ్నిస్తున్నారు.
★ ఇలాంటి ప్రచారాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
★ తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని రైతు నాగేశ్వరరావు చేతులెత్తి వేడుకున్నారు.
★ చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి వ్యవసాయం చేయించడంపై చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్ను కొనిచ్చిన విషయం తెలిసిందే.
★ మంచి మనసు చాటుకున్న సోనూసూద్ను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అభినందించి.. రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతల్ని తీసుకున్న విషయం కూడా తెలిసిందే.
★ అయితే ఇలా సాయం చేయడాన్ని ఏపీలోని ఓ పార్టీ, వర్గానికి చెందిన నేతలు జీర్ణించు కోలేకపోయారు. వెంటనే దుష్ప్రచారానికి తెరలేపారు.
★ రైతు నాగేశ్వరరావు నిజంగా పేదవాడు కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
★ దీంతో మనస్థాపం చెందిన రైతు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
★ తన నిజ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మహల్రాజపురానికి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
★ తన కూతుళ్లను చంద్రబాబు చదివిస్తానని చెప్పడంతోనే తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
★ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నాగేశ్వరరావు తెలిపారు.
★ తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్ను గిఫ్ట్గా ఇస్తే ఇలా దుష్ప్రచారం చేయడమేంటని నాగేశ్వరరావు వాపోయారు.
★ దుష్ప్రచారం చేసే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
★ ఇక ఈ దుష్ప్రచారంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
★ ఎవరో దయతలిస్తే తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.
★ పేద రైతుకు సాయం చేయకపోగా ఎవరో అండగా ఉంటే ఓర్చుకోలేకపోతారా? అని ప్రశ్నిస్తున్నారు.
★ ఇలాంటి ప్రచారాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

