728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

ఏపీ రాజధాని మార్పుపై పీఎంవో ఆరా⁉️

న్యూఢిల్లీ:
★ రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది.

★ గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లులకు సంబంధించి పీఎంవో వివరాలు కోరింది.

★ హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై స్పందించిన పీఎంవో గవర్నర్‌ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్టు తెలిసింది.

★ ఈ రెండు బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన  ప్రతిపాదనలను ప్రధాని కార్యాలయానికి హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్‌ శాస్త్రి పంపారు.

★ దీనిపైనే పీఎంవో గవర్నర్‌ కార్యాలయాన్ని వివరాలు అడిగింది.

దీనిపై జీవీఆర్‌ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ..
★ రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశం, హైకోర్టు నోటిఫికేషన్‌ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగింది.

★ రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి  లేఖలు రాశాం.

★ లేఖపై స్పందించిన ప్రధాని కార్యాలయం మరి కొన్ని వివరాలు అడిగింది.

★ ఆమేరకు వివరాలు కూడా సమర్పించాం అని శాస్త్రి వెల్లడించారు.

★ చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎలా సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించామన్నారు.

★ దీనిపై అటార్నీ జనరల్‌ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

★ అమరావతి జేఏసీలోనూ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి శాస్త్రి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ రాజధాని మార్పుపై పీఎంవో ఆరా⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE