728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 12, 2020

విశ్వసనీయతకు పట్టం.. మర్రి రాజశేఖర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ.. రేపు అధికారిక ప్రకటన

అమరావతి:
🔹మాట తప్పను మడమ తిప్పను అన్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. మర్రి రాజశేఖర్ పేరును గవర్నర్ కోటాలో ముఖ్యమంత్రి గవర్నర్కు పంపినట్లు, ఈ పేరు గవర్నర్ సంతకం అయినట్లు తెలుస్తుంది.

🔹అయితే ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన రెండు రోజుల్లో చేయనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ మర్రికి కాకుండా  విడదల రజిని కు కేటాయించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కళామందిర్ సెంటర్ లో జనం సాక్షిగా రాజ శేఖర్ అన్నను మంత్రిని చేస్తానని ఆనాడు అన్న మాట నేడు నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

🔹అయితే మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి జిల్లా స్థాయిలో కన్వీనర్గా, గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల గెలుపులో  కీలక పాత్ర పోషించడం వల్ల తనకు ఎమ్మెల్సీ పదవి దక్కినట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విశ్వసనీయతకు పట్టం.. మర్రి రాజశేఖర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ.. రేపు అధికారిక ప్రకటన Rating: 5 Reviewed By: NEWS UPDATE