728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 26, 2020

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆల్ పార్టీస్ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా రాష్ట్రములో ఇటీవల కాలంలో కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీమంత్రి తెలుగుదేసం పార్టీ నేత ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టుకు రూ 50 లక్షల కోవిడ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం రూ 50 లక్షల పరిహారం అందజేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు మస్తాన వలి మాట్లాడుతు విధి నిర్వహణలో భాగంగా కరోనా బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ కుటుంభానికి నెలకు రూ 25 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. కరోనా సమయంలో ప్రతి జర్నలిస్ట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి నెలకు రూ.15,000 అందించాలని అన్నారు. వైసిపి నేత ఆనం సంజీవరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్  అందరు కలసి ప్రబుత్వం వత్తిడి తెవాలని అలాగే దేశ వ్యాప్తంగా ఒకరోజు పెన్, కేమోరా డౌన్ చేయ్యలని పిలుపునిచ్చారు. జనసేన మహిళ నేత రమాదేవి మాట్లాడుతూ తమ పార్టీ జర్నలిస్ట్ కోసం పోరాటికి సిద్దంగా ఉందని, ఇప్పటికే మా అధినేత జర్నలిస్టులకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రోహిత్ మాట్లాడుతూ నిజంగా జర్నలిస్టులు చేస్తున్న సేవాలు వేలకట్టలేనివన్నారు. ప్రతి జర్నలిస్ట్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. అంతక మందు రాష్ట్ర అధ్యక్షడు ఐ.వి సుబ్బారావు విడియో కాల్ ద్వారా మాట్లాతూ రాష్టృంలో ఉన్న అందరికి జగన్ సర్కార్ అడిగినవి, అడగనివి ఇస్తున్నారని, ఒక్క జర్నలిస్టులను మాత్రమే పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రాష్టృంలో దాదపుగా 220 మంది జర్నలిస్టులు కరోనాతో బాదపడుతున్నారని, 7 గురు చరనిపోయారని ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో అందోశన చేస్తామని హెచ్చరించారు. జిల్లా అద్యక్షుడు మీరా, కార్యదర్శి శివ, రాష్ట్ర నాయకులు బాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగులో ఉన్న జర్నలిస్టుల హెల్త్ స్కీం ప్రమాద భీమాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట నాయకులు మోహాన్, కుమర్ రాజా, మధు, అల్ పార్టీల నాయకులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE