గత నెల 28వ తేదీన రూరల్ సీఐ సుబ్బారావు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అయితే తాము ధైర్యంతో కరోనాని జయించి వచ్చామని సీఐ సుబ్బారావు తెలిపారు.
ఈరోజు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్న ఆయన 24X7 న్యూస్ అప్డేట్ తో మాట్లాడారు. భౌతిక దూరం తప్పనిసరని, మాస్కు ధరించాలన్నారు. చాలా మంది భయపడే ప్రాణాలు కోల్పోతున్నారని, భయపడకపోతే ఇది ఒక సీజనల్ వ్యాధి లాగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు.
