728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది ప్రభుత్వం: చంద్రబాబు

అమరావతి:
★ "దిశ" చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది.

★ మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి?

★ రాజమహేంద్రవరంలో ఒక మైనర్ దళిత బాలికను 4 రోజులపాటు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడి... చివరికి నిందితులే బాధిత బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి... పోలీసులనే సవాల్ చేసారంటే... రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో చూడండి.

★ చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో బాలిక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరులో మరో మహిళపై అత్యాచారాలు.. ఇప్పుడీ దళిత మైనర్ బాలిక.

★ 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్ లు..

★ నెల్లూరులో మహిళా ఎంపిడివోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్ పై దౌర్జన్యాలు, మాస్క్ పెట్టుకోమన్న మహిళా ఉద్యోగిని పై ప్రభుత్వ కార్యాలయంలోనే భౌతికదాడి,...ఇవన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ట?

★ పాలకులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే. దాని దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయి.

★ ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి.

★ బాధితులకు న్యాయం చేయాలి.

★ బడుగు బలహీన వర్గాల పేదల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది ప్రభుత్వం: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE