728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2020

భారత్‌లో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు..!

న్యూఢిల్లీ:
★ భారత్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కలవరపెడుతోంది.

★ నిత్యం దేశంలో దాదాపు 1000 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.

★ గడిచిన 24 గంటల్లో మరో 944 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.

★ దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 49,980 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

★ ఇక పాజిటివ్‌ కేసుల పెరుగుదల రోజురోజుకు కొనసాతూనే ఉంది.

★ దేశంలో నిత్యం దాదాపు 60వేల మంది ఈ వైరస్‌ బారినపడుతున్నారు.

★ నిన్న ఒక్కరోజే కొత్తగా మరో 63,490 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

★ దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,89,682 కు చేరింది.

★ వీరిలో ఇప్పటివరకు 18లక్షల 62వేల మంది కోలుకున్నారు.

★ మరో 6లక్షల 77వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

★ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది.

★ నిన్న మరో 53వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

★ ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71శాతం దాటగా మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది.

★ కొవిడ్‌ మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు..! Rating: 5 Reviewed By: NEWS UPDATE