728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 7, 2020

కేరళలో విరిగిన కొండచరియలు... 9 మంది మృతి

కేరళ:
★ కేరళలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

★ ఇడుక్కి జిల్లా రాజమలలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి.

★ ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

★ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

★ చిక్కుకున్న వారంతా తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించారు.

★ ఐఏఎఫ్‌ సాయం కోరిన సీఎం.

★ ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

★ ఇడుక్కి జిల్లాలోని రాజమలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినట్టు సీఎం పినరయి విజయన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

★ పోలీసు‌, అగ్నిమాపక దళం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు.

★ కొండ చరియలు విరిగిపడిన ప్రదేశంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించాలని విజయన్‌ భారత వైమానిక దళాన్ని కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కేరళలో విరిగిన కొండచరియలు... 9 మంది మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE