చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం నాగభైరవవారిపాలెంలో ఒకే ఇంట్లో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. బొప్పూడి గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఎడ్లపాడు మండలంలోని ఎడ్లపాడు గ్రామంలో ఒక వ్యక్తికి, ఒక టెక్స్టైల్ మిల్లులో పని చేస్తున్న మరో వ్యక్తికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నాదెండ్ల మండలంలో గత ఆదివారం గణపవరం గ్రామంలో సుమారు 150 మంది వ్యక్తులకు కోవిడ్ టెస్టులు చేశారు. వీరిలో ఆరుగురు వ్యక్తులకు కరోనా వచ్చినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. ఈరోజు ఇప్పటివరకు మొత్తం మీద నియోజకవర్గంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఎడ్లపాడు మండలంలోని ఎడ్లపాడు గ్రామంలో ఒక వ్యక్తికి, ఒక టెక్స్టైల్ మిల్లులో పని చేస్తున్న మరో వ్యక్తికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నాదెండ్ల మండలంలో గత ఆదివారం గణపవరం గ్రామంలో సుమారు 150 మంది వ్యక్తులకు కోవిడ్ టెస్టులు చేశారు. వీరిలో ఆరుగురు వ్యక్తులకు కరోనా వచ్చినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. ఈరోజు ఇప్పటివరకు మొత్తం మీద నియోజకవర్గంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

