728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 7, 2020

కరోన కంటే ప్రమాద కరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు

చిలకలూరిపేట: అధికారులకు ప్రజాధనంతో నిర్మాణం జరిగిన 52 ఎకరాల్లో పేదల నివాస గృహాల్లో కరోన టెస్టింగ్ సెంటర్ వద్దని అఖిలపక్షం చేసిన వినతులు పేడ చెవిన పెట్టి అవగాహన లేని అనాలోచిత నిర్ణయాల వల్లే చిలకలూరిపేట లో కరోన విజృంభిస్తుందని, దీనికి బాధ్యత వహించాల్సింది అధికారులా లేక ప్రజా పాలకులా అని ప్రశించారు. అవగాహన లేని నిర్ణయాల వల్లే చిలకలూరిపేట లో పారిశుధ్య కార్మికులు కరోన వైరస్ బారిన పడ్డారని అన్నారు. కరోన కట్టడిలో చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,కరీనా పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

అఖిలపక్షం ,ప్రజాసంఘాలు క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు వలన కలిగే దుష్ఫలితాలు గురించి  వివరించేందుకు కమిషనర్ ను కలవాలని వెళ్లిన నాయకులమీద కేసులు నమోదు చేసి మరీ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.అయితే కరోన నివారణ చర్యల విషయంలో  మాత్రం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దోపిడీ మీద ఉన్న ధ్యాస కరోన కట్టడిలో చూపించాలని మున్సిపల్ కమిషనర్ ను ఉద్దేశించి అన్నారు.
గతంలో sandri వసూళ్లు అపమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇస్తే ..స్థానిక కమిషనర్  sandri వసూళ్లు జరిపారు.కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని కధ అని కమీషనర్ ని అడగగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారుకాని లిఖిత పూర్వక ఆదేశాలు రావాలన్నారు.

పట్టంణంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలమీద సమీక్షలు నిర్వహించకుండా ,లోక్డౌన్ ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్న మున్సిపల్ అధికారులు sandri మార్కెట్ వేలంపాటలు నిర్వహించడం ద్వారా ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ప్రజా ఆరోగ్యం మీద చూపాలన్నారు.
మున్సిపల్ పారిశుధ్య విభాగము లో జరుగుతున్న అవకతవకల మీద సమగ్రమైన విచారణ చేయాలని ,పరిశుధ్య విభాగంలో జరుగుతున్న శ్రమదోపిడి పై నిజాలు నిగ్గు తేల్చాలని అలాగే మెప్మా విభాగంలో ఆర్ పి లపై కక్ష సాధింపులు అక్రమాలు,ఉన్నత్తాధిలారులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో సీపీఐ నాయకులు cr మోహన్,సుభాని,సుబ్బాయమ్మ,పేలురి రామారావు,బాబురావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దుల రాధాకృష్ణ,పట్టణ తెలుగు దేశం అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు,అర్ ఏ మల్లికారుజునరావు,మాదిగ దండోరా వ్యవస్థాప అధ్యక్షుడు అడపా మోహన్,bsp పార్టీ నాయకులు నల్లపు కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు పెరుబోయిన వెంకటేశ్వరులు,నవతరం పార్టీ నాయకులు రావు సుబ్రమణ్యం,హ్యూమన్ రైట్స్ సభ్యులు మునఫ్, జనక్రాంతి పార్టీ నాయకులు గౌస్,ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు సయ్యద మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోన కంటే ప్రమాద కరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE