చిలకలూరిపేట: పట్టణంలో నెహ్రూ నగర్ వాసులు పైప్లైన్ ద్వారా వాటర్ రాక కరోనా వైరస్ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులకి తెలిపారు. మున్సిపల్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని తమకు నీరు రాక అధికారులకు ఫోన్ చేసిన కిందిస్థాయి సిబ్బంది నీరు వదలక పోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే విడదల రజిని పట్టణంలో ఎవరు నీరు లేక ఇబ్బంది పడకుండా ఉండాలని పలుమార్లు అధికారులకు సూచించినా... నిమ్మకు నీరెత్తినట్లుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
ఎమ్మెల్యే విడదల రజిని పట్టణంలో ఎవరు నీరు లేక ఇబ్బంది పడకుండా ఉండాలని పలుమార్లు అధికారులకు సూచించినా... నిమ్మకు నీరెత్తినట్లుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

