728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 31, 2020

చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

అమరావతి:
★ చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు తెలిపారు.

★ రష్యాతో ఉమ్మడిగా భారత జట్టు బంగారు పతకం సాధించడం హర్షణీయమని చంద్రబాబు కొనియాడారు.

★ భారత విజయంలో కోనేరు హంపీ, విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.

★ భారత చదరంగం జట్టు అందరూ గర్వపడేలా చేసిందని నారా లోకేశ్ అభినందించారు.

చంద్రబాబు ట్వీట్...
★ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ విజేతలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందనలు తెలిపారు.

★ రష్యాతో పాటు ఉమ్మడిగా భారత జట్టు బంగారు పతకం సాధించడం ఎంతో గర్వకారణమని చంద్రబాబు కొనియాడారు.

★ భారత విజయంలో కోనేరు హంపీ, విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.

★ విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి నిజమైన మాస్టర్లని ప్రశంసించారు.

లోకేశ్ ట్వీట్...
★ భారత చదరంగ జట్టు అందరూ గర్వపడేలా చేసిందని నారా లోకేశ్ అభినందించారు.

★ తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు వెళ్లింది.

★ ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, రష్యాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్లు ఫిడె ప్రకటించింది.

★ మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్‌లో ఫైనల్‌కు చేరుకుని విజేతలుగా నిలిచిన రష్యా, భారత్‌ జట్లకు బంగారు పతకాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు ఫిడె తెలిపింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు Rating: 5 Reviewed By: NEWS UPDATE